రామకృష్ణ బీచ్, వైజాగ్ లో విశ్వ మానవ సంక్షేమ సంఘం మరియు వైజాగ్ చిల్డ్రన్ క్లబ్ ఆధ్వర్యంలో స్వచ్ భారత్ చెత్త ఏరే కార్యక్రమం
ఈ రోజు అనగా 25-1-26 న రామకృష్ణ బీచ్, వైజాగ్ లో విశ్వ మానవ సంక్షేమ సంఘం మరియు వైజాగ్ చిల్డ్రన్ క్లబ్ ఆధ్వర్యంలో స్వచ్ భారత్ చెత్త ఏరే కార్యక్రమం మరియు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వ మానవ సంక్షేమ సంఘం వ్యవస్థాపకులు మస్తాన్ రావు పెసల పెసల మాట్లాడుతూ ప్రభుత్వానికి ఎంత చెత్త ప్రతి రోజు ఎంత వస్తుంది, ఎలా డిస్పోస్ ఆఫ్ చేయాలి, ప్రజలు ఏమి చేయాలి అని మొట్టమొదట గా ప్రభుత్వానికి అవగాహన ఉండాలి.


ఒక్కొక్క చోట చెత్తబుట్టలు నిండి క్రింద పడిపోతుందని ఆ చుట్టు పక్కల ప్రాంతాలు చాలా అపరిశుభ్రంగా ఉంటుందని. హై వేల వెంట రోడ్డుకిరువైపుల చెత్త చాలా పేరుకు పోయి ఉంటుందని చెప్పారు. ఈ దేశాన్ని చెత్త రహిత సమాజంగా తయారు చేయాలంటే ప్రభుత్వం, ప్రజలు చాలా కష్ట పడాలని, మనము అభివృద్ధి చెందిన దేశాలు ఎలా చేస్తున్నాయని తెలుసుకోవాలని చెప్పారు

