
37 వ ఉచిత ట్యూషన్ సెంటర్
విశ్వ మానవ సంక్షేమ సంఘం ఈ రోజు అనగా 5-7-2025 అల్లూరి సీతారామ రాజ్ నగర్, కార్వాన్, హైదరాబాద్ లో 37 వ ఉచిత ట్యూషన్ సెంటర్ సుందరయ్య విజ్ఞాన కేంద్రం, హైదరాబాద్ వారితో కలిసి ప్రారంభించటం జరిగింది. విశ్వ మానవ సంక్షేమ సంఘం వ్యవస్థాపకులు మస్తాన్ రావు పెసల మాట్లాడుతూ ఈ ట్యూషన్ సెంటర్ల యొక్క ప్రధాన ఉద్దేశం చదువు ఒక్కటే కాకుండా చదువుతారు నైతిక విలువలు, క్రమశిక్షణ, సమయపాలన, మానవత్వం, పర్యావరణ పరిరక్షణ, భారతీయ సంస్కృతి లాంటివి నేర్పించి ఉన్నతమైన పౌరువులుగా తీర్చిదిద్దాలని మా ప్రయత్నమని చెప్పారు. ఈ సమావేశంలో బాలోత్సవం ముఖ్య కార్యదర్శి మాట్లాడుతూ పిల్లలు మంచి మార్కులు తెచ్చుకోవాలని, మేము ప్రతి రెండు , మూడు నెలలకు ఒకసారి విద్యార్థుల ప్రతిభను రివ్యూ చేస్తామని, టీచర్లు పిల్లలను అభివృధి పదంలో తీసుకెళ్లాలని, మంచి పౌరులుగా తీర్చి దిద్దాలని చెప్పారు.
మస్తాన్ రావు గారు మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాలలో ఇప్పటి వరకు ఈ సెంటర్ తో కలిపి 37 సెంటర్లు నడుస్తున్నాయని, ఈ సంవత్సరం షుమారుగా 100 సెంటర్లు ప్రారంభించాలని అనుకుంటున్నారని చెప్పారు.

Opening of 37th free tuition centre, in Alluri Seetha Rama Raju Nagar, Karvan, Hyderabad by Viswa Manava Samkshema Sangam and Sundarayya Vignan Kendram, Hyderabad on 5-7-2025.