Universal Human Welfare Association
విశ్వ మానవ సంక్షేమ సంఘం
Be Happy and Be healthy
ఆనందంగా ఉండండి మరియు ఆరోగ్యంగా ఉండండి
ఏ వ్యక్తి ఎదగాలన్నా, మంచి పేరు తెచ్చు కొవాలన్నా మంచి బుద్ధి అవసరం, జ్ఞానం అవసరం. మంచి నడవడిక అవసరం. సామాజిక స్పృహ అవసరం. క్రమశిక్షణ, సమయ పాలన, మానవత్వం, మన దేశ నాగరికత మరియు సంస్కృతి అవసరం ఎందుకంటే భారతీయ నాగరికత, సంస్కృతి చాలా గొప్పది కనుక.
మనలో చాలా మంది తెల్లారి లేస్తే అబద్ధాలు చెపుతాము . చిన్న దానికి పెద్ద దానికి చెబుతాము. ఎప్పుడైతే అబద్ధాలకు అలవాటు పడతామో ప్రజలు మనల్ని నమ్మటం మానేస్తారు. మీకు పిల్లవాడు పులి కథ తెలుసు. ఒక అబ్బాయి అమ్మ నాన్నతో అడవిలో వెళుతూ ఉంటారు. ఆ పిల్లవాడు వాళ్ళ అమ్మా నాన్నను భయ పెట్టటానికి తమాషాకి పులి పులి అంటాడు. వాళ్ళ అమ్మా నాన్న భయ పడుతూ పులి పులి ఎక్కడ అంటారు. పులి లేదు తమాషాగా అన్నాను అంటాడు. ఆవిధంగా రెండు మూడు సార్లు అంటాడు. వాళ్ళ అమ్మ నాన్నలు భయ పడతారు. నాలుగవ సారి నిజంగానే పులి వస్తుంది. వాళ్ళ అమ్మా నాన్నలు నాలుగవ సారి కూడా తమాషాకి అన్నాడని అమ్మా నాన్నలు పట్టించుకోరు. పులి ఆ పిల్లవాడిని చంపి తింటుంది. అప్పుడు వాళ్ళ అమ్మా నాన్నలు ఏడుస్తారు. గాంధీ గారు జీవితాంతం సత్యమే మాట్లాడే వాడు. సత్య హరిశ్చంద్ర సత్యం కోసం భార్య పిల్లలను అమ్ముకుంటాడు. పెద్ద పెద్ద కంపెనీలలో కూడా సత్యం చెప్పే వాళ్ళనే నమ్ము తారు. వాళ్ళే పైకి వస్తారు.
భారత దేశంలో మోసాలు చాలా ఎక్కువ. చాలా మంది నేతి బీరకాయ మాదిరి మాట్లాడుతుంటారు. నిజాన్ని మనం ఒప్పు కోవాలి. అన్నదమ్ముల ఆస్తుల దగ్గర ఒకరి నొకరు మోసం చేసుకుంటారు. రాజకీయ నాయకులు ప్రజలను మోసం చేస్తుంటారు. రియల్ ఎస్టేట్ వాళ్ళు ఒకే భూమిని ఇద్దరు ముగ్గురికి అమ్ముతారు. దొంగ డాక్యుమెంట్లు సృష్టించి భూములను కబ్జా చేస్తారు. కల్తీ ఎరువులు, కల్తీ పాలు, కల్తీ తేనె లాంటివి ఎన్నో మోసాలు చేస్తుంటారు. వ్యాపారంలో భాగస్తులను మోసం చేస్తాము. ఏ సమస్థలో నైనా పని చేసేటప్పుడు ఆ సంస్థ ను, యజమానుని మోసం చేస్తాము. మనం తయారు చేసే వస్తువులలో కూడా మోసాలు. అదే అభివృద్ధి చెందిన దేశాలలో చాలా తక్కువ మోసాలు జరుగు తుంటాయి. అందుకనే విదేశీ వస్తువులను ఎక్కువగా కొంటువుంటారు . ఎప్పుడయితే మోసాలకు అలవాటు పడతారో ఆ దేశం పెద్దగా అభివృద్ధి చెందదు. మనము చేసే పనిని నిజాయితీగా మోసం లేకుండా చేయాలి. కష్ట పడి పని చేయాలి.
హింస ఎక్కడ ఉంటుందో అక్కడ అభివృద్ధి ఆగిపోతుంది. ఎందుకంటే సామాన్య మానవుడు ప్రశాంత వాతావరణంలోనే జీవించాలనుకుంటాడు. ఒక వ్యాపారస్తుడు కానీ, పారిశ్రామికవేత్త కానీ ప్రశాంత వాతావరణంలోనే వ్యాపారం చేస్తాడు, పరిశ్రమను పెడతాడు. రౌడీలు, అల్లరిముకలు ఉంటే ఆ ప్రాంతంలో సాధారణ ప్రజలు ఉండరు . అట్లాగే నక్సలైట్లు , ఫాక్షన్ ప్రాంతాలు అభివృద్ధి చెందవు. ఈ మీరందరూ చూడండి పాలెస్తాన ఇశ్రాయేలు, ఉక్రెయిన్ రష్యా, ఆఫ్ఘనిస్ధాన్, ఇరాన్ , ఇరాక్ లాంటివి ఆర్థికంగా దెబ్బతిన్నాయి, జనజీవనం అతలాకుతలం అయిపోతున్నాయి. అలాగే హింసతో కూడుకున్న వ్యక్తుల జీవితాలు కూడా చాలా దారుణంగా ఉంటాయి. ప్రజలు, దేశాలు అందరూ కూడా హింసకు దూరంగా ఉండాలి. మహాత్మ గాంధీ జీవితాంతం అహింసా సిద్ధాంతాన్ని నమ్మాడు. దేశాలు కూడా సాధ్యమైనంత వరకు యుధాలను నివారించాలి. ఈ రోజు మోడీ గారు కూడా ఉక్రెయిన్ ,రష్యా లను సమస్యను శాంతి యుతంగా పరిస్కారించుకోవాలన్నాడు.
పెరుగుతున్న జనాభా అభివృద్ధికి ఆటంకము. పెరుగుతున్న జనాభా కు అనుగుణంగా నీరు, కరెంటు, డ్రైనేజీ, ఇండ్లు, రవాణా, చదువు ఇవన్నీ కుర్చాలి. జనాభా పెరిగేకొద్దీ మురికివాడలు పెరుగుతుంటాయి. ప్రభుత్వం చాలా భారం పడుతుంది. వ్యవసాయ భూములన్నీ కూడా రియల్ ఎస్టేట్ క్రింద మారి పోతాయి. ఒకప్పటి రోజులలో వరదలు, కరువు కాటకాలు, రోగాలు, యుద్ధాలు ఇవన్నీ కూడా పెరుగుతున్న జనాభా ను అరికట్టేవి. ఇప్పుడు నదుల మీద ఆనకట్టలు కట్టి వరదలను చాలా వరకు అరికట్టారు. గ్రీన్ రెవల్యూషన్, మిగతా రివలూషన్లు వలన కరువు కాటకాలు తగ్గి పోయాయి. వైద్య రంగంలో వచ్చిన మార్పుల వల్ల మరణాల రేటు తగ్గాయి. ఆయుః ప్రమాణం పెరిగింది. అందువలన మరణాల తగ్గి జననాలు పెరిగాయి. చావులు కూడా తగ్గాయి. స్వతంత్రం వచ్చేనాటికి షుమారుగా 33 కోట్లు ఉన్న భారతీయ జనాభా 2024 కి 144 కోట్లు ఉంది. ఇంకొక 50, 60 ఏళ్ల తరువాత ఈ దేశ జనాభా ఎంత పెరుగుతుందో ఒక్క సారి ఆలోచించండి. అందువలన ప్రజలందరూ కుల, మతాలకు అతీతంగా అందరూ కుటుంబ నియంత్రణ పాటించి జనాభా పెరుగుదలను అరికట్టాలి.
Reach us @
Copyright ©UHWA.in- All rights reserved.